సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె శాన్విక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్లగా.. బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయల్దేరారు.అయితే అప్పనపల్లి శివారుకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా.. అప్పటికే నలుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో వారి కుటుంబంలో, బల్వంతాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బాలికలను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సంచలన తీర్పుబాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సైఫాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం ఐదుగురికి జీవిత ఖైదు విదించింది. మరో ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి పదేళ్లు, 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది. బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో 38 మంది బాధితులకు విముక్తి లభించింది. ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి పాల్పడే నేరస్థులకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు
Actor ProfilePolitician
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Jan 2027
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి