
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్ స్టాంపీడ్ బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రాతిపదికన తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కరూర్ జిల్లా కలెక్టరేట్లో జూలై 10న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన 32 మంది కుటుంబ సభ్యులకు సీఎం విజయ్ స్వయంగా ఈ ఉత్తర్వులను ఇచ్చారు. మద్రాస్ హైకోర్టు ఈ నియామకాలకు తాత్కాలిక అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణమైన విషాద ఘటన 2025 సెప్టెంబర్ 27న కరూర్లోని వెలుసామిపురం వద్ద చోటుచేసుకుంది. అక్కడ నిర్వహించిన తమిళగ వెట్రి కజగం ర్యాలీలో భారీగా జనసమూహం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లోనే బాధిత కుటుంబాలను విజయ్ వ్యక్తిగతంగా పరామర్శించి ఆర్ధిక సాయం ప్రకటించారు. దీంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. ఇదిలా ఉండగా సీఎం విజయ్ తన సొంత పార్టీ తరపున అదనంగా మరో 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే విద్యా అర్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, నైట్ వాచ్మ్యాన్ వంటి ప్రభుత్వ పోస్టులలో వీరికి అవకాశాలు కల్పించారు. పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు శాఖలతో సహా వివిధ విభాగాలలో ఈ నియామకాలు జరిగారు. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ప్రభుత్వ నిర్ణయానికి కొన్ని కఠినమైన షరతులతో కూడిన తాత్కాలిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఈ ఉద్యోగాలన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మొదటి జీతం చెల్లించే ముందే కోర్టు మరోసారి విచారణ జరుపుతుందని న్యాయస్థానం