బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపు
Actor ProfilePolitician

బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపుపై దృష్టి
Andhra Jyothy11 Dec 2026
బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపుపై దృష్టి

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందంతో సీఎం చంద్రబాబు ఈరోజు( బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.16 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. బీచ్ శాండ్ మైనింగ్, ఏయే ఉత్పత్తులు వస్తాయో.. వాటిని ఏయే రంగాల్లో వినియోగిస్తారని తెలిపారు. వాటికి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆయా అంశాలను అదానీ ప్రతినిధుల బృందం సీఎంకు వివరించింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు