
తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరవుతామని తెలిపారు. నీటీ వాటాపై బలంగా కొట్లాడుతామని పేర్కొన్నారు. అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ ఫాం హౌస్లో పండిన వరికి వచ్చిన ధర ఎంతో చెప్పాలంటూ కేటీఆర్ను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తాము కోటిన్నర రూపాయిలకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. 5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు. హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలను భయపెట్టడం కేటీఆర్కు మంచిది కాదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడికి హితవు పలికారు. తమపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని ఆయనకు సూచించారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేద పేర్కొన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు