
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Jagadish Reddy Comments: కన్నేపల్లి పంప్ హౌస్లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని.. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కుట్ర, మోసాన్ని తెలంగాణ రైతాంగం గమనిస్తోందన్నారు. చేతగాకపోతే తమకు అప్పగించాలని.. వారం రోజుల పాటు కేసీఆర్కు అప్పగిస్తే మెత్తం నీరు పారించి చూపుతామని సవాల్ విసిరారు. మంత్రి ఉత్తమ్ చెప్తున్నట్లు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయాలని.. ఏ ఒక్క బ్యారేజ్కు ఏం జరిగినా తమ బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేసుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ను రద్దు చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ అడిగినా... కేబినెట్ అడిగినా తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని అన్నారు. "చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమే.. ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదు. అలా అయితే ఎస్సెల్బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలి. ఏడాది నుంచి మోటార్లను కనీసం ప్రారంభం చేయలేదని ఇంజనీర్లు చెప్తున్నారు. మంత్రి ఉత్తమ్కు ఏమీ తెలియదు.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారు. మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారు. రాష్ట్ర