
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుతరీతిలో విజయవంతమైంది. భారత్-కొరియా మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేశ్, ఆయన బృందం అక్కడి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి విశేష గౌరవాన్ని అందుకుంది.50కి పైగా కంపెనీలతో కీలక చర్చలుఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్, బీఎన్కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ముఖ్యంగా ఎల్జీ సంస్థ తమ ప్రధాన కార్యాలయానికి లోకేశ్ను ప్రత్యేకంగా ఆహ్వానించి, ఉన్నత స్థాయి బృందంతో గౌరవ విందు ఇవ్వడం ఈ పర్యటనకు లభించిన ప్రాధాన్యతను చాటుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై లోకేశ్ ఇచ్చిన ప్రజెంటేషన్కు కొరియన్ కంపెనీల నుంచి అద్భుత స్పందన లభించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నత యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా సంస్థలు హామీ ఇచ్చాయి.బుసాన్లో ‘అపెక్స్-కొరియా’ సెల్ ప్రారంభంపెట్టుబడిదారులకు మరింత చేరువయ్యేందుకు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కొరియాలోని