
పారిశ్రామిక వివాదాల చట్టం పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటవుతుందని మెజార్టీ తీర్పు న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్సహా ఆరుగురు న్యాయ మూర్తులు ఈ తీర్పు ఇవ్వగా ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ఈ తీర్పు 6:3 మోజార్టీతో వెలువడినట్లు అయ్యింది. 1978లో ఏడుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని చేసిన రిఫరెన్స్ చెల్లుబాటైనట్టు తాజా తీర్పులో స్పష్టం చేశారు. 1978 ఫిబ్రవరి 21న బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించిన కేసులో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ‘పరిశ్రమ’అన్న పదం నిర్వచనాన్ని విస్తరించింది. ఈ తీర్పును రాసిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఏది పరిశ్రమ అన్నది తేల్చేందుకు ట్రిపుల్ టెస్ట్ ఒకటి రూపొందించారు. దాని ప్రకారం పరిశ్రమ అంటే... 1. వస్తువులు లేదా సేవల ఉత్పత్తి, పంపిణీ జరగాలి. 2. ఇందుకోసం యజమాని – ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి. 3. కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృతమై ఉండాలి. ఈ తీర్పుతో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్లు, ప్రభుత్వ సంక్షేమ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు 1947 పారిశ్రామిక వివాదాల (ఐడీ) చట్టం పరిధిలోకి వచ్చారు. అయితే తాజాగా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన మెజార్టీ తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని చెబుతూనే దానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే రద్దయిన 1947 నాటి ఐడీ చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్ను వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా... ట్రిపుల్ టెస్ట్ మౌలికంగా చెల్లుబాటు అయ్యేదనని, కాకపోతే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(జే) వంటి కొన్ని విషయాల్లో స్పష్టత అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తాజా