పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి
Actor ProfilePolitician

పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి
Andhra Jyothy24 Sept 2026
పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడినట్లు సమాచారం (PoK protests). పీవోకేలో ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేతలను ఇటీవల అరెస్ట్ చేయడం, సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దద్యాల్-మీర్పూర్ వంతెనపైనా, ముజఫరాబాద్‌లోనూ ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి (Pakistan security forces). నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు (POK News). నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బలప్రయోగానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నిరసనకారులను అణచివేయడానికి, పీవోకేలోకి వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంటోంది. మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్ స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే