
ఉదయాన్నే దట్టమైన అడవుల్లో సఫారీ వాహనంలో విహారం.. సాయంత్రానికి పొలం గట్టున వేసిన మంచెపై సేద తీరుతూ, వేడివేడి జొన్న రొట్టెను ఘుమఘుమలాడే నాటుకోడి పులుసుతో ఆస్వాదించడం.. ఇలాంటి అపురూపమైన పల్లెటూరి అనుభూతిని నగరవాసులకు, పర్యాటకులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేరళ, గోవా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతమైన 'హోమ్స్టే' విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు పర్యాటక శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సాధారణ హోటళ్లు, రిసార్టులకు భిన్నంగా, గ్రామీణ వాతావరణంలో స్థానికుల ఇళ్లలోనే బస చేస్తూ వారి జీవనశైలి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రత్యక్షంగా అనుభూతి చెందే అవకాశాన్ని ఈ పథకం కల్పించనుంది.పర్యాటకానికి కొత్త ఊపుఈ విధానం ద్వారా రాష్ట్రంలోని అనేక పర్యాటక, ఆధ్యాత్మిక, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం, లక్నవరం సరస్సు, తాడ్వాయి అటవీ ప్రాంతాలు హోమ్స్టేలకు చిరునామాగా మారనున్నాయి. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని దట్టమైన అడవులు, కుంతాల, బొగత జలపాతాల సమీప గిరిజన గూడేలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి. వీటితో పాటు నల్గొండ జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలు, బౌద్ధ క్షేత్రాలు, మాల్దీవులను తలపించే సోమశిల, పోచంపల్లి చేనేత గ్రామాలు, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.స్థానికులకు ఉపాధి.. యజమానులకు ఆదాయంఈ హోమ్స్టే విధానం కేవలం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చనుంది. గ్రామీణ