
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Railways Approves 7 New Amrit Bharat Express: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. లోయర్, మిడిల్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టారు. ఇవి సుదీర్ఘ ప్రయాణాలను తక్కువ సమయంలో పూర్తి చేయడమే కాకుండా, ప్రీమియం రైలు సర్వీసుల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మొత్తం 7 రైళ్ల కనెక్టివిటీకి రైల్వే బోర్డు అనుమతి తెలిపింది. ఆ రైళ్లు ఏ రూట్లలో వెళ్తాయో చూద్దాం. ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైల్వే బోర్డు ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది. ట్రైన్ నంబర్ 22363/ 22364 కలిగిన ఈ రైలు ధన్ బాద్ జంక్షన్ నుంచి ఎన్.ఎస్.ఈ బోస్ జంక్షన్, పరాశనాద్, హజారీబాగ్ రోడ్డు, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ రోడ్డు, డెహ్రాసారాం, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మీర్జాపూర్, ప్రయాగ రాజ్, కాట్నీ, జబల్పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగపూర్, చంద్రపూర్, బాలార్ష, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తని, కార్డ్పాటి, జోలర్, పెట్టాయి, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పుర్ మీదుగా వెళ్తుంది. ప్రయాగరాజ్ నుంచి లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రయాగరాజ్ నుంచి