
Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో లయన్స్ క్లబ్ వ్యాసరచన పోటీలు! కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “క్రిటికల్ థింకింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ప్రదర్శించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు మురారి శంకర్ అప్ప తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, సోమేశ్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు