
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Wife killed her husband in Hyderabad: సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు అసలు ఉన్నాయా ?.. అన్న అనుమానం కల్గుతుంది. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన ఘటనలు సమాజంలో అసలు వివాహ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. కొంత మంది భార్యభర్తలు దారుణాలకు పాల్పడిన మొత్తంగా పెళ్లి అంటేనే యువతీ, యువకులు జడుసుకుని పారిపోతున్నారు. కొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్ని చంపుతుంటే, మరికొన్ని చోట్ల భార్తలు తమ భార్యల్ని సుపారీలు ఇచ్చి మరీ చంపిస్తున్నారు. హత్యలకు రకరకాల ప్లాన్ లు వేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ఆర్థిక పర అంశాలతో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని మియాపూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని మియాపూర్ లో ఒక మహిళ తన భర్త కన్పించడం లేదని గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు మహిళ ప్రవర్తనపై అనుమానంతో ఆమె కాల్ రికార్డులను పరిశీలించారు. సదరు మహిళ గతేడాది నుంచి అనేక మార్లు ఒకే నంబర్ కు కాల్ చేసి గంటల కొద్ది మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా తన భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు మహిళ అంగీకరించింది. Read more: Siya Goyal: కేతన్ మర్డర్ కేసులో మరో సంచలనం.. మర్డర్కు ముందే ప్రియుడు చేతన్తో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సియా గోయల్.. ప్రియుడితో కలిసి ఉన్న తమ