
‘లెనిన్’ను నిజాయితీగా చేశాం.. మా కంటెంట్ మాట్లాడుతుంది - రిలీజ్ ప్రెస్ మీట్లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘‘నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా ఉంటాయి. నందు తన సొంతూరు శ్రీరామపురంకి అఖిల్ను తీసుకు వెళ్లాడు. నందు ఇంట్లో అఖిల్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. ‘లెనిన్’ కథలో ఉండే పెయిన్ని అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. ప్రతీ సినిమాకి ఒకేలా కష్టపడతారంతా. అఖిల్లోని పెయిన్, ఈ కథలోని పెయిన్కి సింక్ కుదిరింది. నేను నిర్మాతగా ఇందులోకి వచ్చాను కాబట్టి కథ విషయంలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ టైంలో పుటేజ్ చూపించారు. ఇదొక గొప్ప సినిమా అవుతుందని అప్పుడే అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతి పాత్ర (భాగ్యశ్రీ) ఈ సినిమాకి సోల్, హార్ట్ బీట్. ఎన్నో పాత్రలు, ఎన్నో లేయర్స్ని పెట్టి నందు గొప్ప కథను రాసుకున్నారు. వాటికి తగ్గట్టుగా తమన్ అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం చిత్రాన్ని చేయలేదు. అందుకే మేం సంతృప్తి అయ్యే వరకు ఆగాం. జూన్లోనే మా మూవీ రెడీగా ఉంది. ఇంకో రెండు వారాల టైం ఇవ్వండని టెక్నీషియన్లు అడిగారు. దాని వల్ల సినిమా ఇంకా ఎఫెక్టివ్గా వచ్చింది. నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి