
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో టీడీపీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే స్థానిక స్థాయిలో నేతల మధ్య తలెత్తుతున్న విభేదాలు కూటమి ఐక్యతపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత రాజకీయ విభేదాల కంటే కూటమి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని రెండు పార్టీలు స్పష్టం చేశాయి. నేతల మధ్య సమస్యలు ఉంటే వాటిని బహిరంగంగా ప్రస్తావించడం కాకుండా పార్టీలు ఏర్పాటు చేసిన సమన్వయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించాయి. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు (Ongole) రాజకీయ పరిణామాలు కూటమి వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy), టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి (Damacharla Janardhan Reddy) మధ్య చోటుచేసుకున్న మాటల తూటాలు రాజకీయంగా వేడి పెంచాయి. ఇరువైపుల నుంచి వచ్చిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రత్యర్థి రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం అప్రమత్తమైంది. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. సమస్యలను వ్యక్తిగత స్థాయిలో పరిష్కరించుకోవడం కంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని నేతలకు సూచించింది. ఈ నేపథ్యంలో విజయవాడ (Vijayawada)లో సోమవారం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. టీడీపీ తరఫున మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao), మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పాల్గొన్నారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), ఎమ్మెల్సీతో పాటు ఇతర ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. సమన్వయ కమిటీ నాయకులు ఒంగోలు పరిణామాలకు సంబంధించిన వివరాలను సంబంధిత నేతల నుంచి నేరుగా తెలుసుకునేందుకు జూమ్ ద్వారా మాట్లాడారు. ఇరువర్గాల