
పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులకు అక్కడి సైనిక నాయకత్వం సిద్ధమవుతున్నట్టు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో సైన్యానికి అధికారికంగా కీలకపాత్ర కల్పించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు అత్యంత సన్నిహిత వర్గాలు ఈ మేరకు పది సంవత్సరాల జాతీయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయని కథనాలు వస్తున్నాయి.ఈ ప్రతిపాదిత ప్రణాళిక కేవలం ఆర్థిక సంస్కరణలకే పరిమితం కాకుండా దేశ పాలనా స్వరూపాన్నే మార్చేలా ఉంది. ఇందులో భాగంగా, కొత్త ప్రావిన్సులు, పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సవరించడం వంటి అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా దేశ కీలక నిర్ణయాల్లో సైన్యాన్ని 'సమాన వాటాదారుగా' మార్చాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం ప్రభావం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈసారి రాజ్యాంగబద్ధంగానే ఆ పాత్రను శాశ్వతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.అధ్యక్ష తరహా పాలన కోసం తుర్కియే, ఈజిప్ట్ దేశాల నమూనాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చని, విధానపరమైన స్థిరత్వం సాధ్యమవుతుందని సైనిక నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక విదేశీ అధినేతలతో నేరుగా చర్చలు జరపడానికి అధ్యక్ష పాలన మరింత అనుకూలంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. అయితే, ఈ మార్పులు చేయాలంటే రాజ్యాంగంలో భారీ సవరణలు అవసరం. దీనికి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర