
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alamatti Dam Flood Water: ప్రస్తుతం కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద నీరు పొటెత్తుతుంది. ఒక ప్రాజెక్ట్ రూల్ కర్వ్ ప్రకారం జూలై నెలలో ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిని నిల్వచేయడానికి వీలు లేదు. ఎంత వరద వస్తే అంత నీటిని దిగువకు విడుదల చేయాల్సిందే. ల్మట్టి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధ్యం 129.72 72 టీఎంసిలు (శతకోటి ఘనపుటడుగులు) కాగా ప్రస్తుతం 82 టీఎంసిల నీరు నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే బుధవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టితో పాటు నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండితేనే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టికి రోజు 14 టీఎంసీల నీరు.. అయితే ఆల్మట్టి ప్రాజెక్టులకు ప్రస్తుతం రోజుకు 14 టీఎంసిల నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు.ఇదేవిధంగా మరో రెండు రోజులో వరద కంటిన్యూఅయితే ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది.ముఖ్యంగా గత వారం రోజులుగా కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యామ్కు వరద ప్రవాహాం కొనసాగుతుంది. దీంతో ఆల్మట్టి నుంచి నారాయణ పూర్కు ఉజ్జని, జూైరాల, అటు తుంగభద్ర ప్రాజెక్టులు నిండాల్సి ఉంటుంది. నారాయణ పూర్ ప్రస్తుత నీటి మట్టం 37.64 టీఎంసీలకు గాను 24 టీఎంసీల వరకు ఉంది. అటు ఉజ్జని డ్యామ్