
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. విశాఖపట్నం నగర ప్రజలకు, ప్రయాణికులకు దశాబ్దాలుగా సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం (INS డేగా సివిల్ ఎన్క్లేవ్) నుంచి వాణిజ్య షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆగస్టు 16 అర్ధరాత్రి 00:01 గంటల సమయం నుంచి విశాఖ ఎయిర్పోర్టు తన షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలకు స్వస్తి పలకనుంది. దానికి బదులుగా విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆధునిక వసతులతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17వ తేదీ ఉదయం నుంచి విమాన సేవలు అధికారికంగా షురూ కానున్నాయి. పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఈ కీలకమైన మార్పును అధికారికంగా ప్రకటించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక మార్పులో భాగంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ ఎన్క్లేవ్ నుంచి రాబోయే 30 ఏళ్లపాటు షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి ప్రత్యేకం మినహాయింపు ఉంటుంది. భారత వాయుసేన (IAF), సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకలకు వినియోగించే విమానాలతో పాటు లీజ్, వీఐపీ ఎయిర్క్రాఫ్ట్లు మరియు నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు మాత్రం విశాఖ ఎయిర్పోర్టు నుంచే యథావిధిగా కొనసాగుతాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న గుర్తింపు కోడ్ 'VTZ (వీటీజెడ్)' ను ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి కొత్తగా ప్రారంభమవుతున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో మొదటి రోజే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) భోగాపురం నుంచి తొలి రోజే ఏకంగా 31 సర్వీసులను నడిపేందుకు పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు