నా గ్రేట్ విజన్ కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి
Actor ProfilePolitician

నా గ్రేట్ విజన్ కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా గ్రేట్ విజన్ కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి
NTV Telugu15 Dec 2026
నా గ్రేట్ విజన్ కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి

CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులది కేవలం త్యాగం మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అంశమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం తన గ్రేట్ విజన్‌కు తొలి విజయమని అన్నారు. రైతుల నమ్మకం, సహకారం లేకపోతే అమరావతి రాజధాని సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాజధాని ఎక్కడ అన్నదానిపై తొలుత గందరగోళం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై స్పష్టత లేకపోయిందని చంద్రబాబు తెలిపారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికలో మెజార్టీ ప్రజలు రాజధానిని ఈ ప్రాంతంలోనే నిర్మించాలని అభిప్రాయపడ్డారని చెప్పారు. అనంతరం అసెంబ్లీలో చర్చ జరిగి అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి రాష్ట్రంగా ఏర్పడిందని, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతిలో రాజధాని నిర్మించాలని సంకల్పించినట్లు సీఎం వివరించారు. హైటెక్ సిటీని కట్టినప్పుడు కూడా విమర్శలు తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా పలువురు విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. రోడ్లు వేసి తాను షో చేస్తున్నానని కొందరు ఎగతాళి చేశారని, అయినా వెనక్కి తగ్గలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులను నిర్మించి చూపించానని చెప్పారు. అదే నమ్మకంతో అమరావతి నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారని సీఎం తెలిపారు. తాను సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవాన్ని చూసి రైతుల్లో విశ్వాసం పెరిగిందని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులు లేకపోతే అమరావతి లేదు రాజధాని నిర్మాణానికి రైతులు