
దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై నగరం వేదికగా వ్యూహాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కోవళంలోన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణ దృష్ట్యా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు మార్గమంతటా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు ఆసీనులయ్యారు. ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్న సరిహద్దు తగవులు, నదీ జలాల పంపిణీ పీటముడులు, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారం అందించుకోవాలనే ప్రతిపాదనలతో సమావేశం రసవత్తరంగా మారింది. క్షమాపణలు కోరిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా ఊహించని పరిణామంఅమిత్ షాతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీ.. కావేరి రగడ!సదస్సు ప్రారంభానికి ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతున్న కావేరి జలాల రగడను, మేకేదాటు ఆనకట్ట నిర్మాణంపై తమ వైఖరిని ఆయన అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ముగ్గురు తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీటి విడుదల పై జరుగుతున్న ఆందోళనల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్లు సమాచారం. విజయ్పై విరుచుకుపడిన పత్రిక.. సమస్యల సుడిగుండంలో పరిష్కారం దిశగా