.webp)
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. ! ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి మోసపోయి, థాయ్లాండ్-మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన తెలుగు యువతను సురక్షితంగా మాతృభూమికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బాధితులందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగాల వంకతో కొన్ని సైబర్ నేర ముఠాలు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగ యువకులను ఆకర్షించాయి. థాయ్లాండ్లో ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, తీరా అక్కడికి వెళ్లాక అనధికారికంగా సరిహద్దు ప్రాంతాలకు తరలించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. అక్కడ చట్టవ్యతిరేకమైన ఆన్లైన్ మోసాలకు పాల్పడాలని బాధితులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు యువకులు సైబర్ ముఠాల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని, థాయ్లాండ్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో నిస్సహాయ స్థితిలో ఆశ్రయం పొందుతున్నారు. తమను రక్షించి స్వదేశానికి తీసుకెళ్లాలంటూ బాధితులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రత్యేక వీడియోలను విడుదల చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూదిల్లీలోని ఏపీ భవన్ అధికారులను మంత్రి నారా లోకేశ్ తక్షణమే అప్రమత్తం చేశారు. కేంద్ర విదేశాంగ శాఖతో పాటు థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో నిరంతరం సమన్వయం జరుపుతున్నారు. బాధితుల పూర్తి వివరాలను సేకరించి, వారికి అత్యవసర తాత్కాలిక వసతి, భద్రత కల్పిస్తూ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు, విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ఏజెంట్ల చెల్లని హామీలను నమ్మి ప్రయాణాలు చేయకుండా, కేవలం అధికారికంగా భారత ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థల ద్వారానే విదేశీ అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. విదేశాల్లో తమ పిల్లలు చిక్కుకుపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యులకు ప్రభుత్వం