
ఆంధ్రప్రదేశ్ లో బడి పిల్లల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. 'తల్లికి వందనం' పథకంలో మొదటి విడత కింద డబ్బులు రాని అర్హులైన తల్లుల కోసం మరో గోల్డెన్ ఆప్షన్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో ఎన్పీసీఐ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ ఇష్యూస్ లేదా ఇతర టెక్నికల్ రీజన్స్ వల్ల ఖాతాల్లో డబ్బులు పడకపోతే అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. అలాంటి వారితో పాటు ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో జాయిన్ అయిన స్టూడెంట్లకు గుడ్ న్యూస్ అందిస్తూ, నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 30వ తేదీన ఎలిజిబుల్ అయిన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో రూ.13,000 క్రెడిట్ చేయబోతోంది. మొదటి విడతలో ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు అందని లబ్ధిదారుల లిస్ట్ను ముందే సచివాలయాల్లో డిస్ప్లే చేశారు. అభ్యంతరాలు ఉంటే వినతులు ఇవ్వడానికి ఆగస్టు 7 వరకు గడువు ఇచ్చారు. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 4,470 రీ-వెరిఫికేషన్ అప్లికేషన్లు వచ్చాయి. ఇకపోతే ఈ ఇయర్ కొత్తగా బడి బాట పట్టిన పిల్లలు, ఇంటర్ లో చేరిన స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 25 వరకు టైమ్ ఉంది. వచ్చిన ఆప్లికేషన్లన్నీ ఆఫీసర్లు కంప్లీట్గా వెరిఫై చేసి, ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. సరిగ్గా అదే రోజు కన్ఫర్మ్ అయిన లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం రూ.13వేలు నేరుగా జమ చేస్తుంది. పైసలు రావాలంటే కేవలం అప్లై చేసుకుంటే సరిపోదు, మీ బ్యాంక్ అకౌంట్ కండిషన్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ విడతలో చాలామందికి డబ్బులు రాకపోవడానికి మెయిన్ రీజన్ బ్యాంక్ అకౌంట్కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ లేకపోవడమే. అందుకే మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ లింకింగ్ పక్కాగా ఉందో లేదో చెక్ చేయించుకోండి. గ్రామ, వార్డు