
తిరుమల: త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షింగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు