
రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. ఎంపీగా తనకొచ్చిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజయ్ స్వయంగా అందజేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. అందులో భాగంగానే ఈ చిరు సాయం చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడం పట్ల విజయ్ను పలువురు ప్రశంసిస్తున్నారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ