
తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో "ఫోటో వార్" రూపం తీసుకుంది. ‘ఎక్స్’ వేదికగా ఇరు పార్టీల అధికారిక ఖాతాల నుంచే ఎడిట్ చేసిన ఫొటోలతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ ఫోటోల యుద్ధానికి తెలంగాణ బీజేపీ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. "వన్ టీమ్, వన్ మిషన్ - వికసిత్ తెలంగాణ" అనే క్యాప్షన్తో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతల గ్రూప్ ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం.. ఆ ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డిని చేర్చి "అసలు వ్యక్తిని మర్చిపోయారేంటి?" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి, బీజేపీ ఒక్కటేనని చెప్పే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పోస్ట్పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అంతకుమించిన దూకుడుతో బదులిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేత బండి సంజయ్ కాళ్లపై పడినట్లుగా మార్ఫింగ్ చేసిన ఫోటోను తమ అధికారిక ఖాతాలలో పోస్ట్ చేసి ఎదురుదాడికి దిగింది. ఈ మార్ఫింగ్ ఫొటోల వివాదం ఇక్కడితో ఆగలేదు. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై కేటీఆర్, హరీశ్రావు వ్యంగ్య పోస్టులు పెడుతుండగా, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫామ్హౌస్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ఎత్తిచూపుతూ కౌంటర్లు ఇస్తోంది. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోల్ను బీఆర్ఎస్ నకిలీ