
వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో, ప్రముఖ నటి లయ కథానాయికగా నటించిన ఎమోషనల్ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ టీమ్తో NSR స్పెషల్


వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో, ప్రముఖ నటి లయ కథానాయికగా నటించిన ఎమోషనల్ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ టీమ్తో NSR స్పెషల్

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మధ్య ఇప్పుడు వార్ జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా? నిజంగా వారేం యుద్ధం చేసుకోవడం లేదులే కానీ, వారు చేయబోతోన్న చిత్రాల విషయంలో మాత్రం ఇప్పుడు వార్ స్టార్ట్ అయినట్లుగానే భావించాలి. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) మధ్య ఇప్పుడు వార్ జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా? నిజంగా వారేం యుద్ధం చేసుకోవడం లేదులే కానీ, వారు చేయబోతోన్న చిత్రాల విషయంలో మాత్రం ఇప్పుడు వార్ స్టార్ట్ అయినట్లుగానే భావించాలి. రీసెంట్గా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా దైవిక నేపథ్యంతో ఉంటుందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్తో యుద్ధానికి అధిపతి, దేవతల సైన్యాధిపతి అయిన కార్తికేయుని కథ ఇదని క్లారిటీ కూడా వచ్చేసింది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా ఓ మూవీని ప్రకటించారు. ‘తమిళ మురుగన్’ (Thamizh Murugan) పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర గ్లింప్స్ని కూడా విడుదల చేశారు. కార్తికేయుడిని మురుగన్ అని కూడా పిలుస్తారనే విషయం తెలియంది కాదు. ఈ సినిమా కూడా దైవిక నేపథ్యంలోనే ఉంటుందనేది ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అనేలా టాక్ మొదలైంది. ధనుష్-వెట్రిమారన్ నుంచి వచ్చిన ఈ అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా త్రివిక్రమ్ అండ్ యూనిట్ షాక్కు గురై ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఎవరూ ఊహించని ప్రకటన ఇది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. ఈ మూవీ పూర్తి చేసి, త్రివిక్రమ్తో సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ధనుష్తో వెట్రిమారన్ ‘తమిళ