తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు
Actor ProfilePolitician

తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు
Zee Telugu7 Jan 2027
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ.. పలువురు ప్రముఖులు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala VIPs Darshan: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎవరెవరు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో భారత క్రికెట్‌ జట్టు ఆటగాడు తిలక్ వర్మ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సుప్రభాత సేవ అనంతరం ప్రముఖులకు రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. దర్శనం అనంతరం ప్రముఖులు తిరుమల ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో తిరుమల ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇక తిరుమలలో దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టు 17వ తేదీన శ్రీవారిని మొత్తం 79,445 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 36,834 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.80 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూ విక్రయాలు 3.95 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 3.39 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సుమారు సర్వదర్శనం కోసం అంటే ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు లేని భక్తులకు