
తూర్పుగోదావరి: పాశర్లపూడిలంక అంబేడ్కర్ నగర్ కాలనీలో బుధవారం తాచుపాము కలకలం రేపింది. ఓ ఇంటి సమీపంలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ధైర్యంగా వ్యవహరించి ప్లాస్టిక్ గొట్టం సాయంతో పామును జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని బిందెలో సురక్షితంగా బంధించారు. పాము ఎవరినీ కాటేయకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పామును గ్రామానికి దూరంగా తీసుకెళ్లి జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టారు. తాచుపాము కనిపించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురైనా, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊరట చెందారు. కాలనీల్లో ఇలాంటి విషపూరిత పాములు కనిపిస్తే వాటిని స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా, నిపుణుల సహాయం తీసుకోవాలని స్థానికులు సూచించారు. బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు) ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) స్టాక్ లోకి లలితా జువెల్లరీ IPO.. ఒక్కో షేరు ఎంతో తెలుసా? జగన్ సార్ ఉన్నంతవరకు మాకు ఎలాంటి భయం లేదు.. విరూపాక్షి భార్య కామెంట్స్ ఇప్పుడు జగనన్నను కలిసి ఒకే ఒక్క మాట చెప్పాలి వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో డ్రోన్లు హల్ చల్