ఢిల్లీ చేరిన వనపర్తి కాంగ్రెస్ లొల్లి
Actor ProfilePolitician

ఢిల్లీ చేరిన వనపర్తి కాంగ్రెస్ లొల్లి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీ చేరిన వనపర్తి కాంగ్రెస్ లొల్లి
Telugu Times26 Jan 2027
ఢిల్లీ చేరిన వనపర్తి కాంగ్రెస్ లొల్లి

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయితీ ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. మాజీ మంత్రి, సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఢిల్లీ బాట పట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను కలిసి చిన్నారెడ్డి వైఖరిపై నేరుగా ఫిర్యాదు చేసి, ఆయనపై క్రమశిక్షణా చర్యలు డిమాండ్ చేయాలని మేఘారెడ్డి నిర్ణయించడంతో వనపర్తి రాజకీయం మరింత వేడెక్కింది. గత కొంతకాలంగా వనపర్తి కాంగ్రెస్‌లో చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, స్థానిక రాజకీయాలపై చిన్నారెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలు, ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. పార్టీని, స్థానిక నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఆయన మాట్లాడారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమై, బహిరంగ పోరుగా మారాయి. చిన్నారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీరియస్‌గా పరిగణించింది. పార్టీ లైన్ దాటి వ్యవహరించారంటూ పీసీసీ క్రమశిక్షణా సంఘం ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, స్థానిక పరిస్థితులు మాత్రం ఏమాత్రం చల్లారలేదు. పార్టీ సీనియర్ నేత అయి ఉండి, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడటంపై చర్యలు నామమాత్రంగా కాకుండా కఠినంగా ఉండాలని ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది. రాష్ట్ర స్థాయిలో పీసీసీ నోటీసులతో వివాదం ముగిసిపోలేదని భావించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, నేరుగా ఏఐసీసీ పెద్దల దృష్టికే ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఖర్గే, వేణుగోపాల్‌ల అపాయింట్‌మెంట్ కోరారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని, ప్రభుత్వ