
అమెరికాతో జరుగుతున్న సైనిక సంఘర్షణను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ఉద్దేశపూర్వకంగా పొడిగించే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ సలహాదారు మొహమ్మద్ రెజా నఖ్దీ ప్రకటించారు. భవిష్యత్తులో ఇరాన్ జోలికి రావలంటే ఏ దేశమైనా భారీ మూల్యం చెల్లించుకోవాలనే భయాన్ని సృష్టించడమే తమ ప్రధాన వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. పిబిఎస్ న్యూస్హవర్కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నఖ్దీ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సైనిక శక్తులను సుదీర్ఘకాలం పాటు క్షిణతకు గురిచేయడం ద్వారా శాశ్వత నిరోధక శక్తిని సాధించవచ్చని ఇరాన్ ఐఆర్జీసీ విశ్వసిస్తోంది. 2026 నాటికి అమెరికా మరియు ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి నియంత్రణ, నౌకలపై విరుచుకుపడటం, క్షిపణి మరియు డ్రోన్ దాడులు ఈ యుద్ధంలో ప్రధానాంశాలుగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఈ కీలక జలమార్గం తమ సంపూర్ణ అదుపులో ఉందని ప్రకటిస్తున్నప్పటికీ, పరిస్థితులు మారే వరకు మార్గాన్ని తెరవబోమని ఇరాన్ కరాఖండిగా చెబుతోంది. గత ఐదు నెలల సైనిక పోరాటంలో అమెరికా ఆర్మీ అసలు సామర్థ్యం తమ అంచనాల కంటే చాలా తక్కువగా ఉందని ఇరాన్ ఐఆర్జీసీ గుర్తించింది. దీంతో వాషింగ్టన్ సైనిక వ్యూహంలో తీవ్ర గందరగోళం నెలకొందని, అమెరికా ప్రతి రెండు రోజులకు ఒకసారి తమ లక్ష్యాలను మారుస్తోందని ఇరాన్ విమర్శించింది. ఇదిలా ఉండగా ఇరాన్ నాయకత్వాన్ని కూల్చివేయడం మరియు దేశాన్ని ముక్కలు చేయడం లాంటి అమెరికా వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయని నఖ్దీ పేర్కొన్నారు. ఖార్గ్ దీవిపై దాడి చేయడం లేదా హార్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవడం లాంటి అమెరికా ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని ఆయన స్పష్టం చేశారు. తమ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం రోజువారీ వినియోగం కంటే చాలా ఎక్కువగా ఉందని కూడా ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో యుద్ధం అనేక సంవత్సరాల పాటు