
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ ఎన్ఆర్ఐ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, టీడీపీ ఎన్ఆర్ఐ జాతీయ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు, ప్రవాసాంధ్రులను పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నూతన కమిటీని ఏర్పాటు చేశారు.44 మంది సభ్యులతో కూడిన ఈ భారీ కమిటీకి నూతన అధ్యక్షుడిగా పి. గురురాజాను నియమించారు. పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శుల బాధ్యతలను ముగ్గురికి అప్పగించారు. జి. గంగాధర్, ముక్కు తులసి కుమార్, చలసాని కిశోర్ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు ఐదుగురిని ఉపాధ్యక్షులుగా నియమించారు. వారిలో ఇంద్రసేన నాయుడు మద్దిబాట్ల, కోమటి జయరాం, రషీదా బేగం, సురేష్ పుట్టగుంట, శ్యామ్ కొడూరి ఉన్నారు.కమిటీలోని ఇతర సభ్యులు, వారి పదవుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:ఆర్గనైజింగ్ సెక్రటరీలు: విజేత జవ్వాది, బాలసుబ్రహ్మణ్యం అన్నమేటి, విజయ్ అడుసుమిల్లి, శివ నాగరాజు నక్కల, కౌతారపు లావణ్య, మాధవి ముప్పవరపు, రాజా రవికిరణ్ కోడి, సైఫుల్లా ఖలీద్, రాచూరి మోహన్, అల్లా వెంకట్, చావా పద్మ, వేణుగోపాల్ రెడ్డి, యష్ బొద్దులూరి, హేమ కోసూరు, విజయ్ చెన్నుపాటి.కార్యదర్శులు: శ్రీనివాస్ గోగినేని, రాజేష్ పల్లేటి, నాగరాజు జడ, పింకీ పొనుగోటి, పేరూరు రామకృష్ణ, గాలి దుర్గాభవాని, వంకా వెంకటరమణమ్మ, కృష్ణ ప్రియ అడుసుమిల్లి, సూర్య బెజవాడ, తరణిధర్ పరుచూరి