
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ చిత్రం నార్త్ అమెరికా మార్కెట్లో ప్రీ-సేల్స్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 20న ప్రీమియర్లు, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ముందస్తు బుకింగ్స్లో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటోంది. ప్రవాసాంధ్రులు, అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా టికెట్ల కొనుగోలుకు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ కెరీర్లో ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల ఫైనల్ అడ్వాన్స్ కలెక్షన్లను ఇది చాలా తక్కువ సమయంలోనే దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఆగస్టు 19 నాటికి ‘ఇరుముడి’ ప్రీ-సేల్స్ వసూళ్లు $150,000 మైలురాయిని దాటి విజయవంతంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా $75K, $100K, $125K మైలురాళ్లను వేగంగా అధిగమిస్తూ ఈ సినిమా మార్కెట్లో తన పట్టును నిరూపించుకుంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 10,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు పంపిణీదారులు స్పష్టం చేశారు. ఈ స్థాయి ముందస్తు స్పందన రావడం విదేశీ మార్కెట్లో రవితేజ చిత్రాలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో రవితేజ నటించిన బిఎమ్డబ్ల్యూ ఫైనల్ అడ్వాన్స్ వసూళ్లు $45K, మిస్టర్ బచ్చన్ $44K, ఈగల్ $41K, మాస్ జాతర $29K వద్ద ముగిశాయి. దీంతో పోలిస్తే ‘ఇరుముడి’ ఇంకా ప్రీమియర్కు సమయం ఉండగానే $150K దాటడం విశేషం. ఇదిలా ఉండగా, గతంలో ధమాకా సాధించిన $539K మార్కు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించే దిశగా ఈ చిత్రం వేగంగా దూసుకుపోతోంది. విదేశీ బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతున్న ఈ గణాంకాలు చిత్ర యూనిట్కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్