
పునరుత్పత్తి దశ కావడంతో మత్స్య శాఖ నిర్ణయం జూలై, ఆగస్టు నెలల్లో చేపలు పట్టవద్దని ఆదేశాలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఉల్లఘించి ఎవరైనా చేపలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ ఉంటుంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ జలా శయంలో మానిటరింగ్ కమిటీ ఉంటుందని అధికా రులు పేర్కొంటున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిస్థితి ఇలా.. జిల్లా వ్యాప్తంగా 275 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 19,220 మంది సభ్యులున్నారు. ఇందులో 88 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 4,217 మంది మహిళలు, 187 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 15,003 మంది పురుష మత్స్య కారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 511 గ్రామ పంచాయతీ చెరువులకు 3,130 హెక్టార్ల విస్తీర్ణం, 185 డిపార్ట్మెంట్ చెరువులకు 15,162 హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఒక రెండు కిలోల చేప నుంచి సుమారు రెండు లక్షలకు పైగా పిల్లలు పునరుత్పత్తి అవుతాయని మత్స్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో 10 శాతం బతికినా 20వేల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్క చేపను కోల్పోయినా దాని నుంచి వచ్చే చేప పిల్లలను కోల్పోయి నట్లేనని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జలాశయాల్లో చేప పిల్లల సంఖ్యను పెంచేందుకు మత్స్య శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చేపల పునరు త్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి.. కొన్నేళ్లుగా జిల్లాలో ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను




