
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులు బోరు పైపులను సైతం ధ్వంసం చేయడంతో సాగునీటి సౌకర్యానికి కూడా నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయిన ఏనుగుల గుంపు పంట పొలాల నుంచి వెళ్లడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఏనుగులను పొలాల్లోకి రానివ్వకుండా కట్టడి చేయడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బాణసంచా, టపాకాయలు పేల్చి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించినా అవి బెదరడం లేదని వాపోతున్నారు. ఏనుగుల దాడులతో పంటలు, బోరు పైపులు ధ్వంసమై తీవ్రంగా నష్టపోయామని.. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల ప్రకారమే జగన్ను ములాఖత్కు అనుమతించాం’ తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం