
ప్రఖ్యాత గాయని ఎస్. జానకి (88) కన్నుమూయడంతో భారతీయ చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆరు దశాబ్దాలకు పైగా తన గాన మాధుర్యంతో కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేసిన ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ఈరోజు (జూలై 12) సాయంత్రం 5 గంటలకు మైసూరులో జరగనున్నాయి.అభిమానులు, ప్రజల సందర్శనార్థం జానకమ్మ పార్థివదేహాన్ని ఈ ఉదయం 7:30 గంటల నుంచి మైసూరులోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్లో ఉంచారు. తమ అభిమాన గాయనికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు కనియర హుండి గ్రామంలోని ఫామ్హౌస్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఎస్. జానకి తన కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 20కి పైగా భాషల్లో 50 వేలకు పైగా పాటలను రికార్డ్ చేసి అరుదైన ఘనత సాధించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.జానకి మృతి పట్ల మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ ఎస్. యతీంద్ర ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఆమె మరణం భారత సంగీతానికి తీరని లోటని పేర్కొన్నారు. జానకి మనవరాలు అప్సర వైద్యుల సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తమ ప్రియమైన బామ్మ కోట్లాది మందికి తన స్వరంతో ఆనందాన్ని పంచారని గుర్తుచేసుకున్నారు