
దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ వారిని ఒక్కటి చేసింది. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, ఒక మలయాళీ మహిళ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళలోని ఎర్నాకుళం జిల్లా పిరవోమ్కు ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్ను వివాహం చేసుకున్నారు. నిజానికి వీరికి తొమ్మిదేళ్ల క్రితమే యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో చట్టబద్ధంగా వివాహం నమోదైంది. అయితే గురువాయూర్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్నది నిధిన్ చిరకాల కోరిక. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఈ వేడుకకు నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్తో పాటు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.వీరి ప్రేమకథ 2016లో యూకేలో మొదలైంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన నిధిన్, ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ కోసం 2008లో యూకే వెళ్లారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తిచేశారు. అయితే, ఆ సమయంలో విదేశీ విద్యార్థులను ప్రభావితం చేసేలా యూకే ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో వీసా రద్దయిన నిధిన్, ఈ విషయంపై పార్లమెంటరీ కమిటీల ముందు తన వాదనను బలంగా వినిపించారు.ఆ సమయంలోనే స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) తరఫున యూకే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2016 ఫిబ్రవరిలో మొదలైన వీరి స్నేహం