
దేశంలో E20 పెట్రోల్ వాడకంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని.. కాలుష్యం అదుపులోకి వస్తుందని.. ఈ ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ.. E20 ఇంధనాలకు అనుకూలంగా తయారు చేసిన తమ సరికొత్త వాహనాలకు దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని.. ఈ కొత్త మార్పుకు తమ కార్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో వాహనదారుల అభిప్రాయాలు, అనుభవాలు మాత్రం కంపెనీల వాదనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.ఈ వివాదం ఇటీవల బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ వీడియోతో మరింత వేడెక్కింది. టొయోటా సర్వీస్ సెంటర్లో రికార్డ్ చేసిన ఆ వీడియోలో.. ఈ20 పెట్రోల్ వాడటం వల్లే తన కారు ఇంజన్ పాడైపోయిందని ఆయన ఆరోపించారు. దీనిపై టొయోటా కంపెనీ వెంటనే స్పందించింది. కారులో సమస్య E20 ఇంధనం వల్ల రాలేదని.. పెట్రోల్లో కల్తీ, చెత్త, ఇతర వ్యర్థాలు ఉండటం వల్లే ఇంజన్ దెబ్బతిందని క్లారిటీ వచ్చింది. టొయోటా తర్వాత ఇప్పుడు మరో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ అంశంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.తమ వాహనాల భద్రత, నాణ్యత, పనితీరుకు తాము ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఇస్తామని మహీంద్రా పేర్కొంది. తమ వినియోగదారులకు భరోసా ఇస్తూ.. మహీంద్రాకు చెందిన అన్ని E20-కంప్లయింట్ వాహనాలను ఈ ఇంధనంతో కఠినమైన పరీక్షలు జరిపిన తర్వాతే మార్కెట్లోకి తెచ్చినట్లు మహీంద్రా కంపెనీ స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రతకు పర్యావరణ పరిరక్షణకు E20 ఇంధనం వైపు అడుగులు వేయడం చాలా కీలకమైన నిర్ణయమని.. బాధ్యతాయుతమైన కంపెనీగా తాము ఈ మార్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు మహీంద్రా కంపెనీ వెల్లడించింది.ప్రభుత్వం, కంపెనీలు ఈ20 పెట్రోల్ను