
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. `కొరియన్ కనకరాజు` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు దీనికి రూ.1.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజుతో పోల్చితే 17శాతం డ్రాప్ కనిపిస్తుంది. అయినా వసూళ్లు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. వీక్ డేస్లో ఈ మూవీకి ఈ స్థాయిలో ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే వరుణ్ తేజ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మంచి రివ్యూస్ వచ్చాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ మొదటి వారంలోనే ఇంతటి భారీగా డ్రాప్ కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుందని భావించారు. కానీ చూడబోతుంటే, యాభై కోట్ల వద్దే ఆగిపోయేలా ఉంది. ఇక `కొరియన్ కనకరాజు`కి ఇప్పటి వరకు ఎంత వచ్చాయనేది చూస్తే, సాక్నిల్క్ లెక్కల ప్రకారం రూ.25.54కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో ఇండియాలో రూ.21కోట్ల గ్రాస్, రూ.18.22కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో రూ.4.60కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ముప్పై కోట్లు కూడా దాటలేదు. ఇతర ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం మరో మూడు కోట్లు అదనంగా చూపిస్తున్నాయి. అంటే రూ.28కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, ఇప్పటి వరకు నాన్ థియేట్రికల్ గా రూ.26కోట్లు వచ్చాయి. దీంతో రూ.12కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.14కోట్ల షేర్ వచ్చింది