
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది. తొలి బ్యాటర్గా రికార్డు పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ