
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ పతక విజేతలతో సుదీర్ఘంగా సంభాషించి.. వారి అనుభవాలను తెలుసుకున్నారు. వారి అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ, యావత్ దేశం తరపున అభినందనలు తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పంచుకున్నారు, అది వేగంగా వైరల్ అవుతోంది.రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!ప్రధానమంత్రి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్ అథ్లెట్లతో జరిగిన ఈ ప్రత్యేక సమావేశం గురించి తెలియజేశారు. ఆ వీడియోలో ఆయన స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరి, పలువురు ఇతర ఛాంపియన్లతో సంభాషిస్తూ కనిపించారు. ఆ వీడియోలో సాక్షి చౌదరి ప్రధాని మోదీ నిరాడంబరతను ప్రశంసిస్తూ.. ప్రధానమంత్రిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయశీలి అని అన్నారు. సంభాషణ సందర్భంగా ఆటగాళ్లు ప్రధానమంత్రిని ఏదైనా మాట్లాడమని కోరగా.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే తన ప్రసిద్ధ సందేశాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు, జో ఖేలేగా, వో ఖిలేగా! ఆల్వేస్ చీర్4భారత్. అంటూ చివరకు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.1947లో భారత్లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్పోర్ట్తో అరబ్ ప్రజలు...39 పతకాలు గెలిచిన భారత్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించి, మొత్తం 39 పతకాలను గెలుచుకోవడం గమనార్హం. వీటిలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. ప్రధానమంత్రితో ఈ సమావేశం అథ్లెట్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది