
కుప్పం నియోజకవర్గంలోని అత్యంత నిరుపేద కుటుంబాల జీవితాలలో సరికొత్త ఆశల వెలుగులు నింపేందుకు అదానీ ఫౌండేషన్ సముచిత రీతిలో ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన పీ4’ (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ భాగస్వామ్యం) పథకంలో భాగంగా, కుప్పం మండల పరిధిలోని బంగారు కుటుంబాల’ తలరాతలను మార్చేందుకు రూపకల్పన చేసిన మహత్తర జీవనోపాధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ భాగస్వామ్యం పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తూ, నిరుపేదలు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా నూతన భరోసాను కల్పిస్తోంది.నిత్యం అనేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ, రేపటి రాత్రి గడిచేదెలా అన్న ఆందోళనతో బతికే అట్టడుగు నిరుపేదలకు ఈ ప్రత్యేక ప్రాజెక్టు ఒక సంజీవనిలా ఉపయోగపడనుంది. కుప్పం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్లు, అత్యధునిక కుట్టు మిషన్లు, పోర్టబుల్ వెల్డింగ్ కిట్లు మరియు స్వయం ఉపాధికి అవసరమైన సామగ్రిని ముఖ్యమంత్రే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తన నియోజకవర్గ ప్రజల కళ్లల్లో వెలిగిన చెప్పలేని ఆనందాన్ని స్వయంగా చూసిన సీఎం, ఫౌండేషన్ సామాజిక నిబద్ధతను మనస్ఫూర్తిగా కొనియాడారు.నిరుపేద సంకెళ్లు తెంచే బంగారు మిత్రులు’అదానీ ఫౌండేషన్ మార్గదర్శి’గా వ్యవహరిస్తున్న ఈ బృహత్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ (APMAS) సహకారంతో కుప్పం మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీల్లో నిరంతరాయంగా సాగనుంది. ఈ ప్రాజెక్ట్ కింద కేవలం వస్తురూప జీవనోపాధి సాయాన్ని అందించి వదిలేయకుండా, ఆయా కుటుంబాల్లో శాశ్వత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యం. నిరుపేదలైన లబ్ధిదారులను పర్యవేక్షిస్తూ, వారిని అన్ని విధాలా సాధికారత వైపు నడిపించేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చారు.ఈ ప్రయాణంలో ప్రతి లబ్ధిదారునికి సరైన మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమ్యూనిటీ కార్యకర్తలను బంగారు మిత్రులు’గా రంగంలోకి దించారు. వీరు ప్రతి నిరుపేద కుటుంబానికి అనువైన వ్యాపార ప్రణాళికల రూపకల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ