
ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్లు మరిచిన వైనం మంత్రి మందలించినా మారని తీరు రాత్రి అయితే జూనియర్ డాక్టర్లే దిక్కు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్ బాట పడుతున్న రోగులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ప్రాణం పోయాల్సిన వారు బాధ్యతను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు రావాల్సిన ఆసుపత్రి వైద్యాధికారి 10.30 తర్వాత వస్తుండడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ హాజరుతోపాటు మాన్యువల్ రిజిస్టర్లలో సంతకం చేయాల్సి ఉండగా రెండేళ్లుగా దాని ఊసే ఎత్తడం లేదు. కేవలం పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే రిజిస్టర్లు పెడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠినంగా వ్యవహరించకపోవడం, రిజిస్టర్లను మెయింటైన్ చేయకపోవడంతోనే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలకూ ‘డోంట్ కేర్’ గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అటెండెన్స్, గవర్నెన్స్, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సదరు మీటింగ్కు ఉస్మానియా నుంచి ఎలాంటి రికార్డులూ తీసుకెళ్లలేదంటే వారి నిర్లక్ష్యం, బేఖాతరు అర్థమవుతుంది. ఆ సమావేశం తర్వాతైనా రికార్డులను పక్కాగా మెయింటెయిన్ చేయాలన్న సోయి అధికారుల్లో లోపించింది. పెద్ద ప్రమాదంతో వచ్చినా పట్టింపేదీ? ఉస్మానియా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీత ఉదంతం తేటతెల్లం చేసింది. నాంపల్లిలో నివాసం ఉండే సునీత గన్ ఫౌండ్రిలోని ఎస్బీఐ హౌస్ కీపింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 12న ఆబిడ్స్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీత తీవ్రంగా గాయపడింది. తీవ్ర