వైఎస్సార్ కడప జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెట్ సమస్యపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు టీచర్లను సస్పెండ్ చేస్తారా అంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల భవిష్యత్తో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోందని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసే పోరాటానికి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను వైసీపీ వ్యతిరేకిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లి మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. ఏపీకి చెందిన ఓ బృందం ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ బృందంలో వేంపల్లి మండలానికి చెందిన ఎస్జీటీలు వెంకటనాథరెడ్డి, అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వరరెడ్డి ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సర్వీసు నిబంధనలను అతిక్రమించి వ్యవహరించారంటూ ఈ ముగ్గురినీ సస్పెండ్ చేశారు. కడప డీఈవో షంషుద్దీన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వ్యవహారంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. వీరు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారంటూ ఓ వాదన వినిపిస్తోంది. అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారనే వాదన కూడా ఉంది. అయితే ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండానే కేంద్ర మంత్రిని కలవడాన్ని విద్యాశాఖ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం
Actor ProfilePolitician
కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారని టీచర్లను సస్పెండ్ చేస్తారా.. వైసీపీ నేత భూమన
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•27 Dec 2026
కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారని టీచర్లను సస్పెండ్ చేస్తారా.. వైసీపీ నేత భూమన