
సామాన్యుడి జేబులోని చిల్లర నాణెం నుంచి దేశ ఆర్థిక శక్తిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టే ప్రతీక వరకు.. మన రూపాయి సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన అధ్యాయం. భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న ఈ చారిత్రక తరుణంలో, మన చేతుల్లో మెదిలే కరెన్సీ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన ఎన్నో సత్యాలు వెలుగులోకి వస్తాయి.ఒకప్పుడు సంస్థానాల రాజముద్రలతో, వేర్వేరు పరిమాణాల్లో చెలామణి అయిన రాగి నాణేలు, వెండి నాణేల స్థానంలో.. నేడు స్మార్ట్ఫోన్ స్క్రీన్పై డిజిటల్ సంతకంగా మారిన డిజిటల్ రూపాయి వరకు మన రూపాయి సాధించిన పురోగతి అసాధారణం.రాజభవంతుల నాణేల నుంచి ఏకీకృత వ్యవస్థ వైపు..1947కి పూర్వం భారతదేశం ఆర్థికంగా, భౌగోళికంగా ఎన్నో ముక్కలుగా ఉండేది. హైదరాబాద్ నైజాం నాణేల నుంచి మరాఠాల కరెన్సీ వరకు ప్రతి రాచరిక ప్రాంతానికి సొంత నాణేల వ్యవస్థ ఉండేది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే క్రమంలో ఆర్థిక సమగ్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది.1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావంతో కరెన్సీ జారీ హక్కులన్నీ ఒకే కేంద్రీకృత వ్యవస్థ కిందకు వచ్చాయి. అంతకుముందు ప్రైవేటు బ్యాంకులు, ప్రెసిడెన్సీ బ్యాంకులు ముద్రించే నోట్లకు చరమగీతం పడుతూ, 1861 నాటి పేపర్ కరెన్సీ యాక్ట్ ద్వారా ప్రభుత్వమే నేరుగా నోట్లను చలామణిలోకి తెచ్చింది.ఒక్క రూపాయి నోటు వెనుక ఉన్న అసలు కథ!మనదేశంలో చలామణి అయ్యే ప్రతి నోటుపైనా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.. కానీ, ఒకే ఒక్క రూపాయి నోటుపై మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన వెండి కొరత ఏర్పడింది. నాణేలను ముద్రించడం సాధ్యం కాక, బ్రిటన్లో ఐదో జార్జ్ రాజు చిత్రంతో మొదటిసారిగా కాగితపు రూ.1 నోటును ముద్రించారు.స్వాతంత్ర్యం వచ్చాక 1949లో బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో సారనాథ్