
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీగా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, కాల్వలు, విద్యుత్ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ.7,469.46 కోట్ల పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్-2 పనులకు రూ.1,323.75 కోట్లను కేటాయించింది. శ్రీసత్యసాయి జిల్లాలో మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్ కెనాల్ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 200 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా అనుమతించింది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000 మెగావాట్ల హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ లిమిటెడ్కు 433.30 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులో రూ.85,200 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1,880 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రూ.31,387 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ అంగీకరించింది. తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో బ్యాటరీ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం