
ఆంధ్రప్రదేశ్లో నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కోలుకునే అవకాశం లేని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు జీవనాధార వ్యవస్థలను ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ జులై 8న ఈ విధివిధానాలకు అధికారికంగా ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన 'గౌరవప్రదంగా మరణించే హక్కు'కు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించారు.ప్యాసివ్ యూథనేషియా అంటే కోలుకోలేని స్థితిలో ఉన్న రోగులకు వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్లు వంటి కృత్రిమ వైద్య సహాయాన్ని నిలిపివేసి, వారు సహజంగా మరణించేందుకు అనుమతించడం. ఇది భారతదేశంలో నిషేధించబడిన 'యాక్టివ్ యూథనేషియా'కు భిన్నమైనది. సుప్రీంకోర్టు 2018లో 'కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో చారిత్రాత్మక తీర్పునిస్తూ ప్యాసివ్ యూథనేషియాకు అనుమతించినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇప్పటివరకు అనిశ్చితి నెలకొంది.మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలుఈ కొత్త నిబంధనల ప్రకారం, స్పృహలో ఉన్న ఏ వ్యక్తి అయినా 'అడ్వాన్స్ డైరెక్టివ్' (ముందస్తు వీలునామా) రాసుకోవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో తనకు ఎలాంటి చికిత్స అందించాలో లేదా నిలిపివేయాలో ముందుగానే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు సాక్షుల సమక్షంలో నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ద్వారా ఈ పత్రాన్ని ధృవీకరించుకోవాలి.ఒకవేళ రోగి పరిస్థితి విషమించి, చికిత్స ఫలించదని భావిస్తే సంబంధిత ఆసుపత్రి ఒక 'ప్రైమరీ మెడికల్ బోర్డు'ను ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు 48 గంటల్లోగా తన నివేదికను సమర్పిస్తుంది. వారి సిఫార్సుల