
డేటా లేక్, స్మార్ట్ గవర్నెన్స్ పాఠాలు మాకు నేర్పండి అమరావతి నగరం ప్రపంచంలోనే అద్భుత నగరం అవుతుంది విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ శిర్సా అమరావతి రాజధాని నిర్మాణ తీరును చూశాం. నిజంగా ఇదొక అద్భుతం. ప్రపంచంలోనే ఇదొక గొప్ప నగరంగా మారుతుంది. నారా చంద్రబాబు నాయుడు విజనరీ ముఖ్యమంత్రి. అభివృద్ధికి, దార్శనికతకు ఆయనొక విశ్వవిద్యాలయం. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏపీ ప్రభుత్వం మార్గదర్శి. ఏపీని చూసి ఢిల్లీ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అనేక రంగాల్లో మాకు మీ సహకారం కావాలి అని మంత్రులు లోకేష్, టీజీ భరత్లతో ఢిల్లీ పరిశ్రమలు, ఆహారం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా కోరారు. ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీలో పర్యటించి ఇక్కడి పారిశ్రామిక విధానాలు, పాలనా సంస్కరణలను అధ్యయనం చేస్తోంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీెఎస్)లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఈ బృందం మంగళవారం సమావేశమైంది. ఈ బృందానికి రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లు సాదర స్వాగతం పలికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి నారా లోకేష్ వివరించారు. 2026 ఆర్థిక సంవత్సంలో ఆంధ్రప్రదేశ్ 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించిందన్నారు. భాతరదేశం ఆకర్షిస్తున్నపెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా క్లస్టర్ ఆధారిత అభివృద్ధి దిశగా పారిశ్రామికాభివృద్ధి సాధిస్తున్నామన్నారు. తిరుపతి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం