
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Airtel 200 Recharge Benefits: భారతీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.200 విలువైన కొత్త ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్ను ప్రవేశపెట్టింది. కేవలం 28 రోజుల చెల్లుబాటుతో 30 జీబీ డేటాను అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటు అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. అదనపు డేటా మరియు ప్రీమియం OTT కంటెంట్ను పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ ప్యాక్ రూపొందించబడింది. డేటా యాడ్-ఆన్ సదుపాయం.. ఈ యాడ్-ఆన్లో 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 30 GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఎయిర్టెల్ అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. దీనిని కేవలం 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, ప్లాన్కు సంబంధించిన సాధారణ డేటా కోటాతో సంబంధం లేకుండా అదనంగా ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇటీవల తన రూ.200 'మెగా కంటెంట్ యాడ్-ఆన్'ను 'OTT పాస్'గా మార్చింది. ఇందులో 15 OTT యాప్లకు యాక్సెస్, అపరిమిత 5G డేటా, 30GB డేటా లభిస్తాయి. జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్.. ఈ ప్యాక్ ప్రయోజనాల్లో భాగంగా, వినియోగదారులకు రూ.149 విలువైన 28 రోజుల జియో హాట్స్టార్ లభిస్తుంది. దీని ద్వారా మొబైల్ పరికరాలలో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, హాట్ స్టార్ స్పెషల్స్, ఇతర వినోద కంటెంట్ను వీక్షించవచ్చు. ఈ ప్యాక్లో 28 రోజుల పాటు 'ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం' (Airtel Xstream Play Premium) సేవలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్