
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం నాడు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధాన సౌధ (అసెంబ్లీ) పరిసరాల్లోని ఆహార కేంద్రాలపై చేపట్టిన దాడుల్లో, ఒక రెస్టారెంట్ వంటగదిలో బొద్దింకలు దర్శనమివ్వడం కలకలం రేపింది.విధాన సౌధ సమీపంలోని ఎమ్మెల్యేల వసతి గృహం (లెజిస్లేటర్స్ హౌస్)లో ఉన్న మల్లిగె హోటల్పై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ హోటల్ వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, అక్కడ బొద్దింకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల మేరకు హోటల్లో ఎటువంటి కీటక నివారణ చర్యలు చేపట్టలేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.విస్మయకరంగా, అధికారులు తమ సొంత ఆరోగ్య శాఖకు చెందిన క్యాంటీన్పై కూడా తనిఖీలు నిర్వహించారు. మగాది రోడ్డులోని ఆరోగ్య సౌధ క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, అక్కడ గడువు ముగిసిన ఇడ్లీ రవ్వ, కొబ్బరి పొడి వంటి ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాల నిల్వలో సరైన విధివిధానాలు పాటించలేదని, పెస్ట్ కంట్రోల్ సైతం చేయలేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.నగరంలోని ప్రధాన హోటళ్లకు సరుకులు సరఫరా చేసే ఒక గోదామును కూడా అధికారులు తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 146 కిలోల చికెన్, 40 కిలోల వెల్లుల్లికి సరైన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేవని, బియ్యం, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లపై తప్పుడు లేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి సదరు సంస్థలకు నోటీసులు జారీ చేశామని, నిబంధనలు అతిక్రమించిన