
తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం తొలకరి వరదతో పరవళ్లుతొక్కుతోంది. ములుగు జిల్లాలో పర్యాటకులను మంత్రముగ్దులను చేసే ఈ బొగత జలపాతం పర్యాటకులను రా రామ్మంటూ ఎగసిపడుతోంది. నీళ్లు లేక దాదాపు ఎనిమిది నెలల పాటు వెలవెలబోయిన ఈ జలపాతం, ఇప్పుడు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ పొంగిపొర్లుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం.. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పాలధారలా జాలువారుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చే సందర్శకులు, ఇక్కడి ప్రకృతి అందాలను చూడగానే తమ అలసటనంతా మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోతున్నారు. జలపాతాల వద్ద జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ద డీప్ఫేక్ డిఫెన్స్’.. టాలీవుడ్ స్టార్స్ Vs AI Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే! Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు.. Weather Update: తీరానికి దూసుకొస్తున్న వాయుగుండం! ముంబైని ముంచేసింది.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
