
Asianet News Telugu•24 Sept 2026
ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్ ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్ఐశ్వర్య లక్ష్మి 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘మాయానది’, ‘వరతన్’ చిత్రాలతో మలయాళ ప్రేక్షకులను మెప్పించారు. తమిళం, తెలుగులోనూ మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన ఐశ్వర్య, ప్రస్తుతం సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండటం లేదు. 'నాకు డాక్టర్గా ఉండటం చాలా ఇష్టం. కానీ, చాలా అనుకోకుండా నటిని అయిపోయాను. అదంతా దేవుడి ప్లాన్. డాక్టర్ అవ్వడం సులభం కాదు, దానికి కనీసం 8 ఏళ్లు పడుతుంది' అని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు